రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే

Published: Friday May 07, 2021
పరిగి, 6 మే ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో, గ్రామపంచాయతీ పరిధిలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ ఉన్న నేపథ్యంలో ఇంటింటి సర్వే నిర్వహిచడం జరిగింది అన్ని సర్పంచ్ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర రెడ్డి పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోవిడ్ కు సంబందిచిన టెస్టులు సుమారు శుక్రవారం రోజు 220 కుంటుంబాలు సర్వే చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ గఫర్, పంచాయతీ కార్యదర్శి రవీందర్రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్ మాధవి పాల్గొన్నారు.