జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుని కలిసిన దెందుకూరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Published: Wednesday April 27, 2022
మధిర ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దెందుకూరు గ్రామం మంగళవారం నాడు ఉదయం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాతా మధు కలిసి గ్రామంలో అభివృద్ధి పనులు మరియు పార్టీ పరిస్థితులును మధు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా అధ్యక్షులు మీ సమస్యలు తప్పక పరిష్కరిస్తామని కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని తెలియచేసారు. దెందుకూరు గ్రామంలో హాస్పిటల్  మంజూరు చేయించాలి అని మధిర విజయవాడ రోడ్డు మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి దెందుకూరు గ్రామం వరకు  రోడ్డు విస్తరణచేసి డివైడర్ నిర్మించాలి అని. దెందుకూరు చిలుకూరు అంతర రాష్ట్ర రహదారి విస్తరణ చెయ్యాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సభ్యులు చుంచు విజయ్, గుర్రం కళాధర్, గుర్రం భాస్కర్, మాజీ సొసైటీ అధ్యక్షులు మాదాల శరత్, అమిరనేని వేంకటేశ్వరరావు, అల్లు అంకబాబు, పగడిపల్లి ఉద్దండు, రాములు, కొల్లి సాయి తదితరులు పాల్గొన్నారు