*ఐ కె పి వి ఓ ఎ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి*

Published: Saturday April 01, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 31, ప్రజాపాలన: ఐ కె పి వి ఓ ఎ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని   ఐకెపి వి ఓ ఎ ల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా డి ఆర్ డి ఎ కార్యాలయం ముందు ధర్నా అనంతరం కార్యాలయ ఎ ఓ కు పలు అంశాలపై శుక్రవారం వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా రమాదేవి, అనిత లు  మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పేద మహిళల కుటుంబాల కోసం ప్రతి ఇంటికి తిరిగి వారిని ఆర్థికంగా సామాజికంగా సమానత్వంగా చైతన్య చేస్తూ ఉత్పత్తి దారులుగా వ్యాపారస్తులుగా  తయారు చేస్తూ రాష్ట్రంలోనే కోట్ల మందికి జీవం పోసిన దాంట్లో  ఐకెపి వి ఓ ఎ లు కీలక పాత్ర పోషస్తున్నారని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, టార్గెట్స్ పేరుతో మానసిక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వి ఓ ఎ ల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేని యెడల  పలు   ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కుంటాల కుమార్, దుర్గం రాములు,  వెంకటేష్, రమేష్, శారదా, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.