వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కుట్టుమిషన్లు మరియు గ్రైండర్లు పంపిణీ కార్యక్రమం

Published: Thursday February 18, 2021
మధిర, ఫిబ్రవరి 17, ప్రజాపాలన: వాసవి ట్రస్ట్ (బెంగుళూరు) వారి ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణమునందు గాంధీ చౌక్ లోని సాయిబాబా దేవాలయం ప్రాంగణము నందు 50% సబ్సిడీ తో ఏర్పాటు చేసినటువంటి కుట్టుమిషన్లు మరియు గ్రైండర్లు నిరుపేద మహిళలకు అందజేయడం జరిగినది. వాసవి ట్రస్ట్ మధిర బాధ్యులు కుంచం కృష్ణారావు గారి సహకారంతో ఖమ్మం, మధిర, చింతకాని లకు సంబంధించిన అర్హులైన నిరుపేద మహిళలకు వాసవి ట్రస్ట్ కార్యదర్శి రాయపూడి రమేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిధులు గా పాల్గొన్న రవాణా శాఖ మాత్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ప్రముఖ సినీ నటులు శ్రీకాంత్ గారు మరియు శివాజీరాజా గార్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కుంచం కృష్ణారావు గారు మాట్లాడుతూ త్వరలోనే మరికొంతమంది అర్హులైన నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు మరియు గ్రైండర్లు 50% సబ్సిడీ తో ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ కార్యదర్శి రాయపూడి రమేష్, వాసవి ట్రస్టు మధిర బాద్యులు కుంచం కృష్ణారావు, దోసపాటి కళ్యాణ్ వెంపటి రంగా, చింతకాని మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు, వికాస తరంగిణి మధిర శాఖ ప్రధాన కార్యదర్శి కోమటీడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు