నూతన డ్రైనేజీ పైప్ లైన్ వేయాలని మేయర్ జక్కా వెంకట్ రెడ్డికి వినతి

Published: Monday October 18, 2021
మేడిపల్లి, అక్టోబర్ 17, (ప్రజాపాలన ప్రతినిధి) : ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లోని పలు కాలనీలో వర్షపు నీరు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నందున బచ్పన్ స్కూల్ నుండి ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ మీదుగా నూతన డ్రైనేజీ పైప్ లైన్ వేయవలసిందిగా కోరుతూ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి రవీందర్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి నూతన డ్రైనేజీ పైప్ లైన్ వేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రమణ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, సుధాకర్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.