చింతల నర్సింహారెడ్డి పై దాడి నాకు నా అనుచరులకు సంబంధం లేదు

Published: Thursday December 16, 2021
మేడిపల్లి, డిసెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : చింతల నర్సింహారెడ్డి పై దాడి నాకు నా అనుచరులకు ఎలాంటి సంబంధం లేదని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ కౌడే పోచయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కౌడే పోచయ్య మాట్లాడుతూ వాట్సప్ లో పౌరుష పదాలు వాడుతు, డివిజన్ ప్రజలను అసభ్యకరమైన రాతలతో కించపరిచే విధంగా పోస్ట్ లు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు చర్యలు సమంజసం కాదన్నారు. బుధవారం బహిరంగంగా చర్చకు రావాలని  వాట్సప్ లో సందేశాన్ని పంపించి  పైగా వచ్చిన కాలనీవాసులపై విచక్షణారహితంగా దాడులు చేయడం విచారకరమని పోచయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 20వ డివిజన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొంత మంది కుట్రలు చేస్తున్నారని, త్వరలోనే డివిజన్ ప్రజలు వారికి సరైన గుణపాఠం చెబుతారని కౌడే పోచయ్య హెచ్చరించారు.