పాండురంగ స్వామి ఆలయంలో ఘనంగా అఖండ హరినామ సంకీర్తన మహోత్సవం

Published: Monday August 29, 2022
మేడిపల్లి, ఆగస్టు28 (ప్రజాపాలన ప్రతినిధి)
 రామంతపూర్ డివిజన్ చిన్న చెరువు ఇందిరానగర్ సమీపంలో నెలకొన్న పాండురంగ స్వామి ఆలయంలో ఘనంగా అఖండ హరినామ సంకీర్తన (సప్తహ) మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.  అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ మరాఠీల సంక్షేమానికి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శుభస్ పటేల్ , పాండురంగ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ,టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గరిక సుధాకర్, సూరం శంకర్,  మరాఠీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.