ఘనంగా టిడిపి 40వ ఆవిర్భావ దినోత్సవం

Published: Tuesday March 30, 2021
జన్నారం, మార్చి29, ప్రజాపాలన ప్రతినిధి : తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాజేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి రాజేశ్వర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోని నిరుపేద బడుగు, బలహీన వర్గాలు అన్యాయాలకు, అరాచకాలకు అవమానాలకు గురవుతున్న సందర్భంలో తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటుకోవడముకోసం  స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టి ని స్థాపించారని గుర్తుచేశారు. అనతికాలంలోనే ప్రజ‌ల మన్ననలు పొంది తోమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చి పేదల సంక్షేమ పథకాలు చేపట్టారని పేర్కొన్నారు. ఆనాడు తెలుగు దేశం పార్టి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేడు ఇతర పేర్లతో తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్నాయని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్న టీడీపీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ సారథ్యంలో పార్టీ ముందుకు తీసుకెళ్తు తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నాయకుడు పులిశెట్టి శ్రీనివాస్, నాయకులు లక్ష్మణ్, గంగన్న, తదితరులు పాల్గొన్నారు.