తెలంగాణ జన సమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా కంతి మోహన్ రెడ్డి

Published: Thursday March 31, 2022

ఇబ్రహీంపట్నం, మార్చ్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ జన సమితి అనుబంధ విభాగం అయిన తెలంగాణ రైతు జన సమితి రాష్ట్ర అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన కంతి మోహన్ రెడ్డిని నియమించినట్టు ప్రో:కోదండరాం గారు మంగళవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్బంగా బుధవారం స్థానిక విలేఖరులతో కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేయడంతో పాటు రైతు విభాగం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అనంతరం తన మీద విశ్వాసంతో రైతు సమితి అధ్యక్షునిగా నియమించిన ప్రో: కోదండరాం గారికి కృతజ్ఞతలు తెలిపారు. మోహన్ రెడ్డి నియామకం పట్ల కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.