ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే సండ్ర..

Published: Friday July 08, 2022
తల్లాడ, జూన్ 7 (ప్రజా పాలన న్యూస్):
 
 తల్లాడ మండలంలోని రెడ్డిగూడెంలో ఉన్న క్రీస్తుజ్యోతి జూనియర్ కళాశాల విద్యార్థులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గురువారం సన్మానించారు. ఆ కళాశాలకు చెందిన షేక్. ఆరిఫా (ఎంపీసీలో) 446, (బైపీసీలో) నేహా 434, వినోద్ 434,  (సీఈసీలో) అక్షయ 483 మార్కులను సాధించారు. రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు కైవసం చేసుకున్న ఆ విద్యార్థులను ఎమ్మెల్యే సండ్ర శాలువాలు, పూలమాలలతో సన్మానించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధనకు కృషి చేసిన ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డేమ్ వీర మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బద్ధం నిర్మల, కళాశాల ప్రిన్సిపాల్ ఫ్రాన్సిస్, వైరా ఏఎంసీ చైర్మన్ ధూపాటి భద్రరాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకట్ లాల్, అంబేద్కర్ నగర్, గొల్లగూడెం సర్పంచ్ లు జొన్నలగడ్డ కిరణ్ బాబు, నారపోగు వెంకట్, నాయకులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు, బద్దం కోటిరెడ్డి, ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, ఉపసర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, నాయకులు కోడూరు వీర కృష్ణ, గుండ్ల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.