కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ బారతి హోళికేరి

Published: Wednesday August 24, 2022
జన్నారం, ఆగస్టు 23, ప్రజాపాలన:  మండలంలోని రాంపూర్ పంచాయతీ కార్యదర్శి హనుమాండ్ల గంగరాజం ను సస్పెండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఉత్తర్వులు జారీ చేశారు, మంగళవారం జన్నారం ఎంపీడీఓ అరుణా రాణి తెలిపారు. గత కొన్ని నెలలుగా రాంపూర్ సర్పంచ్ అలుగునూరి సులోచన, పంచాయతీ కార్యదర్శి గంగరాజం ల మధ్య సమన్వయ లోపం తో పలుమార్లు సర్పంచ్ తో గోడువాకు దిగడం, అంతేకాకుండా వారం రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగినని మరిచి దళిత మహిళ సర్పంచ్ అని చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అయనపై చాలా ఆరోపణలు ఉన్నాయని, అందులో భాగంగా జన్నారం మండలం రాంపూర్ కార్యదర్శి గంగారజం ను, సస్పెండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ బారతి హోళికేరి ఉత్తర్వులు జారీ చేశారు.