గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను సన్మానించిన టియస్ యుటియఫ్ నాయకులు

Published: Monday August 01, 2022
బోనకల్, జూలై 31 ప్రజా పాలన ప్రతినిధి: పదవ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు సాధించిన బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తాటి అంజలి , ఉపాధ్యాయ బృందానికి టీఎస్ యుటిఎఫ్ బిసి వెల్ఫేర్ గురుకుల సబ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీఎస్ యుటియఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గ భవాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో గురుకుల పాఠశాలలు 100% ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇదే వరవడిని కొనసాగించాలని ఫలితాలు వలన ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరింత ఆసక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జీవి నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి వి. రాంబాబు, బోనకల్ మండల బాధ్యులు ప్రీతం , బీసీ గురుకులాల రాష్ట్ర సబ్ కమిటీ కో కన్వీనర్ లివింగ్స్టన్, ఖమ్మం జిల్లా బీసీ గురుకులాల కన్వీనర్ స్వర్ణలత, భద్రాద్రి కొత్తగూడెం కన్వీనర్ పద్మజ, కో కన్వీనర్ అన్నపూర్ణ పాల్గొన్నారు.