హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను సన్మానించిన సాయిని ప్రసాద్ నేత.
Published: Wednesday September 22, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 21, ప్రజాపాలన : తెలంగాణ నేతకాని మహర్ విద్యార్ధి సంగం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత మంగళవారం హైదరాబాద్ లోని కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా హైదరాబాద్ జిల్లా పాలనాధికారిగా నియమితులైన ఎల్.శర్మన్ చౌహన్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన జన్నారం మండలం నుండి ఉన్నత విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాకి కలెక్టర్ గా నియమితులవడం సంతోషకర మని అన్నారు. కలెక్టర్ నేటితరం యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టర్ గా ప్రజలకు సుపరిపాలనను అందించాలని ఆకాక్షించారు.
Share this on your social network: