ఘనంగా నల్ల పోచమ్మ బోనాలు.

Published: Monday July 04, 2022

జన్నారం రూరల్, జూలై 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల పోన్కల్ గ్రామంలో ఆదివారం మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో గ్రామ శివారులోని వీరుల గుట్ట సమీపాన వెలిసిన నల్ల పోచమ్మ తల్లి కి అధిక సంఖ్యలో హాజరై బోనాలు సమర్పించారు, ప్రతి ఏటా ఆషాడమాస ప్రారంభంలో ఇలా అమ్మవారివి బోనాలు సమర్పిస్తూ జాతర నిర్వహిస్తూ ఉంటారు, ప్రస్తుతం కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై  అమ్మవారికి బోనాలు సమర్పించారు, కరోనా కష్ట కాలం నుండి బయటపడి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చల్లగా చూడమ్మా అని భక్తులు నల్ల పోచమ్మ తల్లిని వేడుకుంటూ నైవేద్యాలు సమర్పించారు, ఈ కార్యకమంలో పోన్కల్ జన్నారం మండల మహేంద్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.