*సీఎంఆర్ఎఫ్ ఫండ్ తో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి విముక్తి జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి*

Published: Saturday January 28, 2023

 *ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో గతంలో రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన మోహినాబాద్ మండల్ సాకలిగూడ  గ్రామానికి చెందిన మల్లయ్య అల్లుడు మహేష్ కు 60,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదనీకి గురైన మల్లయ్య కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు బోడంపాహడ్ ఎంపిటిసి రామచంద్ర రెడ్డి సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ఇనాయత్ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు*