హరితహారం భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చాన కార్పొరేటర్

Published: Monday July 12, 2021
బాలాపూర్, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చాన స్థానిక కార్పొరేటర్ జేనిగ పద్మ ఐలయ్య యాదవ్. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ కార్పొరేటర్ జెనిగ పద్మ ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన హరితహారం భాగంగా మొక్కలు నాటే ఆదివారం నాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..... పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, అని పిలుపునిచ్చి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా బిజెపి ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, కార్పొరేషన్ కార్పొరేటర్ భర్త జేనిగ ఐలయ్య యాదవ్, కె ఎన్ ఆర్, పి పి ఆర్ అపార్ట్మెంట్ సభ్యులు, రామిడి శ్రీకాంత్ రెడ్డి, అరుణ్ సింగ్, రాజేష్, మున్సిపల్ విభాగం, ఎస్‌ఎస్‌ఆర్ కాలనీ సభ్యులు, మహిళా తదితరులు పాల్గొన్నారు.