స్వర్ణకారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
Published: Thursday December 01, 2022
జన్నారం, నవంబర్ 30, ప్రజాపాలన: స్వర్ణకారుల సంఘం కార్యవర్గాన్ని బుధవారం మండల కేంద్రంలోని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఆధ్వర్యంలో జన్నారం మండల స్వర్ణకారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, ప్రధాన కార్యదర్శి ఉప్పుల శ్రీనివాస్, కోశాధికారి ముమ్మటి రమేష్, సభ్యులు వై రామచంద్రం, నవీన్, వై సత్యం, ఐ కిరణ్, మన్మధ చారి, కట్ట వెంకటేశ్వర్లు, ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, ఉపాధ్యక్షుడు శ్రీరాముల వెంకటేష్, విజయ్ లు కార్యదర్శి అన్మయ్య, కోశాధికారి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: