మడుపల్లి లో కోవిడ్ బాధితులకు భోజనం ప్యాకెట్లు అందజేత

Published: Friday May 28, 2021
మధిర ప్రజా పాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మడిపల్లి లో మధిర పట్టణంలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మరియు వాలంటీర్లకు వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులు శీలం వెంకట రెడ్డి గారి పర్యవేక్షణలో భోజన ఏర్పాట్లను పూర్తి చేసి వాలంటీర్లకు వ్యాధిగ్రస్తులకు అన్నార్తులకు భోజన పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధిర మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి శీలం విద్యా లత వెంకట్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి ఉన్న విపత్కర సమయంలో తోటివారికి సహాయం చేయాలన్న ఆలోచన రావటం అందున భోజనం ఏర్పాటు చేయటం శ్రమతో కూడుకున్న పని అయినా తోటివారికి సహాయం చేస్తున్నామ్అన్న ఆత్మ తృప్తితో భోజనం ఏర్పాటు చేసిన వైఎస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు సాటి వారికి సహాయం చేసి ఆపదలో ఉన్నవారికి మేమున్నామని భరోసా కల్పించిన  వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర నాయకులు వెంకట్ రెడ్డి గారికి నియోజకవర్గ నాయకులు దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి కి మండల నాయకులు నాగ వేణు గారికి కే బాలకృష్ణ రెడ్డి గారికి కొప్పుల భరత్ గారికి అభినందనలు తెలియజేశారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటంలో వై ఎస్ ఆర్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారని ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని అని బాధలో ఉన్న  పేదలకు బడుగు బలహీన వర్గాలకు సహాయసహకారాలు అందించడంలో వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటారని వై ఎస్ ఆర్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి గారు తెలియజేశారు ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వై ఎస్ ఆర్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులకు ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు ఈ భోజనం పంపిణీ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులు దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి నాగ వేణు యూత్ నాయకులు  కొప్పుల భరత్ విజయ్ కే బాలకృష్ణ రెడ్డి తదితర మడిపల్లి గ్రామ వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ కార్యకర్తలు కరోనా వ్యాధిగ్రస్తులకు ఇంటింటికి ఆహార పదార్థాలను సరఫరా చేశారు