విహరిక కాలనీ సీ సెక్టార్ నూతన అధ్యక్షులుగా అశోక్ రెడ్డి

Published: Monday September 27, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 25వ డివిజన్ లోని విహరిక కాలనీ సీ సెక్టార్ నూతన అధ్యక్షులుగా అశోక్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈమేరకు స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి సమక్షంలో విహరిక కాలనీ సీ సెక్టార్ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. విహరిక కాలనీ సీ సెక్టార్ నూతన అధ్యక్షులుగా అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాజు నాయక్, ఉపాధ్యక్షుడిగా రాజేందర్, మంజుల, సంయుక్త కార్యదర్శులుగా సత్యనారాయణ చారి, శోభ, కోశాధికారిగా మారుతీ ఎన్నికయ్యారు. అడ్వైసర్స్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, కల్చరల్సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్య వర్గ సభ్యులను కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.