మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి ** ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులు
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 28 (ప్రజాపాలన,ప్రతినిధి) : మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారత ప్రథమ సామాజిక తత్వవేత్త అని, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడని, భారతీయ సామాజిక కార్యకర్త కుల వ్యవస్థ అన్నచి వేతలపై వివక్షతను, అన్యాయాలను, రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడని కొనియాడారు. అంటరానితనాన్ని నిర్మూలన కోసం కృషిచేసిన గొప్ప వ్యక్తి అని, విద్య కోసం తన జీవితాన్ని జాతికి అంకితం చేసిన ఆదర్శపరుడని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్, సంఘం జిల్లా నాయకులు మారుతి పటేల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చరణ్, దుర్గం సుధాకర్, ఏఐఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చిరంజీవి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, పోల్కర్ సాయిరాం, అన్నయ్య, ప్రణయ్ కుమార్, జయరాం, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: