జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక కార్యదర్శిగా కల్లూరు గ్రామ సర్పంచ్ అంజయ్య
Published: Thursday September 01, 2022
కోరుట్ల, ఆగస్టు 30 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లాలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన రైతు ఐక్యవేదిక నూతన కార్యవర్గం లో భాగంగా జిల్లా అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన నల్ల రమేష్ రెడ్డి ఎన్నికకాగా కల్లూరు గ్రామానికి చెందిన వనతడుపుల అంజయ్యను జిల్లా కార్యదర్శి గా ఎంపిక చేసినట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన రైతుబంధు జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, దారి శెట్టి రాజేష్ , పత్తి రెడ్డి మైపాల్ రెడ్డి, మారు సాయి రెడ్డి, నల్ల తిరుపతిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బండి భూమన్న,మరియు ఆదిరెడ్డి లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువులు రైతు సంఘం నాయకులు జిల్లా రైతులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం ను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ సంజయ్ లు అభినందనలు తెలియజేశారు
Share this on your social network: