నరసింహారావుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే సండ్ర..

Published: Wednesday September 21, 2022
తల్లాడ, సెప్టెంబర్ 20 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామ మాజీ సర్పంచ్ గణేశుల  నరసింహారావు (72) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. గణేశుల రవిని ఆయన మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నివాళులర్పించిన వారిలో డి సి ఎం ఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, వైరా ఏఏంసీ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు,  ఉన్నారు.