రోగులకు మెరుగైన సేవలు అందించాలి

Published: Thursday July 21, 2022
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
మధిర  జులై 20 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది ప్రేమతో వ్యవహరిస్తూ మెరుగైన సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ పేర్కొన్నారు బుధవారం మధిర విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వార్డులను సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలను, వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలానే    ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల తో మాట్లాడి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలానే అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అలానే ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యం, శుభ్రత పనులు ముమ్మరంగా సాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు