కోటమర్పల్లిలో మీతో నేను కార్యక్రమం

Published: Saturday December 17, 2022
* కోటమర్పల్లి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య
వికారాబాద్ బ్యూరో 16 డిసెంబర్ ప్రజా పాలన : క్షేత్రస్థాయిలోని సమస్యలను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిశీలించడానికి శనివారం రానున్నారని కోటమర్పల్లి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కోటమరపల్లి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య మాట్లాడుతూ మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గ్రామ అంతర్గత సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునుటకు వస్తున్నారని అన్నారు. శనివారం ఉదయం 6.30 గంటలకు గ్రామంలో వీధి వీధి తిరిగి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటారని వివరించారు. పరోక్షంగా చెప్పే సమస్యల కంటే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకొనుటకు ఎమ్మెల్యే వస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామంలో దీర్ఘకాలిక అపరిస్కృత సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ తీసుకొని రావాలని సూచించారు.