జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం
Published: Monday July 11, 2022
బోనకల్, జూలై 11 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ,నేమూరి శంకర్ గౌడ్ ,శ్రీ రామ్ తాళ్లూరి ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గార్లపాడు గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు క్రియాశీలక సభ్యత్వం కిట్లను జనసేన పార్టీ నాయకులు తాళ్లూరి డేవిడ్ చేతుల మీదగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ మండలంలో గార్లపాడు గ్రామానికి వెళ్లి ఇంటింటికి జనసేన భావజాలం. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ భావజాలం తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ నాయకులు తాళ్లూరి డేవిడ్ సహకారంతో పవన్ కళ్యాణ్ మనోగత పుస్తకంలోని ఉన్న కొన్ని అమూల్యమైన విషయాలను కుటుంబాలకు తెలియజేశారు. మరో పది మందిని ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ సజ్జనపు భరత్ , బోనకల్ మండల నాయకులు షేక్ జానీ పాషా,షేక్ బాజీ బాబా,కోసూరి అశోక్, వెంకటరమణ,తదితరుల పాల్గొన్నారు.
Share this on your social network: