విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువ పత్రాలు పంపిణి
Published: Saturday December 11, 2021
బోనకల్, డిసెంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి:మండల పరిధిలో రావినూతల గ్రామం ఉన్నత పాఠశాలలో స్కూల్ పిల్లలకి ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు మండల తహసీల్దార్ రావూరి రాధిక ఆధ్యర్యంలో విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాధిక మాట్లాడుతూ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకొనుటకు ఎస్సి విద్యార్థులు ఆదాయ, కుల ధ్రువపత్రాలు కొరకు అప్లై చేసుకుని ఉన్నారని,అందరు ఉపకార వేతనాలు కొరకు అప్లై చేసేలా ప్రోత్సహించెందుకు విద్యార్థులకు నేరుగా పాఠశాల వద్దకే వెళ్లి ఆదాయ, కుల ధ్రువపత్రాలు అందజేస్తున్నామన్నారు. ఎస్సి విద్యార్థులు అందరు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖధికారి ఇందిరా జ్యోతి, గిర్ధావర్ గుగులోతు లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: