పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

Published: Thursday June 24, 2021

జన్నారం, జూన్ 23, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని రేండ్ల కూడా గ్రామానికి సంబంధించి ప్రచురించబడిన కాళ్లపై నిలబడలేని కుటుంబం అనే శీర్షిక నా ఓ పత్రికలో ప్రచురించడంతో ఆ అంశానికి స్పందించిన మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ స్పందిస్తూ ఆ కుటుంబం యొక్క దయనీయ స్థితి దృష్ట్యా వారికి పునరావాసం కొరకు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని ఎంపీడీవో అరుణ రాణి తెలిపారు, అందులో భాగంగా బుధవారం ఆ కుటుంబానికి  పశువైద్య మరియు సంవర్ధక శాఖ తరపున నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో భాగంగా 90 శాతం సబ్సిడీతో రూపాయలు 66000 ఇవ్వడం జరుగుతుందని, లబ్ధిదారులు కేవలం రూపాయలు 6,600 డిడి తీసి మండల పశువైద్య మరియు సంవర్ధక శాఖ అధికారులకు సమర్పించాలని కోరడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో ఎమ్ హెచ్ ఓ శ్రీకాంత్ ఎం పి ఓ రమేష్  ఎంపీటీసీ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు