హబ్సిగూడలో వినాయకుడి లడ్డును 1.26 లక్షలకు సొంతం చేసుకున్న బాల్ రెడ్డి

Published: Thursday September 23, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : హబ్సిగూడ డివిజన్లోని జె ఎస్ ఎన్ కాలనీ లెజెండ్ అపార్ట్మెంట్ ఎదురుగా బి ఎస్ ఆర్ టీం యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తనయుడు బేతి సుమంత్ రెడ్డి  ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నవరాత్రులు పూజలో ఉన్న (దైవ ప్రసాదం) లడ్డు వేలంపాటలో పావని రెడీ మిక్స్ యజమాని బాల్ రెడ్డి 1,26,000/- (ఒక లక్షా ఇరువై ఆరు వేల కు) సొంతం చేసుకున్నారు. అదేవిధంగా లక్కీ డ్రా లో మొదటి బహుమతి ఎలక్ట్రికల్ బైక్ భవిష్య రెడ్డి, రెండో బహుమతి ఎల్.ఈ.డి.టీవీ కొత్త శేఖర్ రెడ్డి, మూడవ బహుమతి స్మార్ట్ ఫోన్ వనం పల్లి గోపాల్ రెడ్డి, నాలుగో బహుమతి కుక్కర్ లు పదిమంది కి ,లక్కీ లాటరీ ద్వారా సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి, హబ్సిగూడ మాజీ కార్పొరేటర్  బేతి స్వప్న రెడ్డి, బేతి సుమంత్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, పల్ల కిరణ్ కుమార్ రెడ్డి, ఎండి ముస్తాక్, పల్లె నర్సింగ్ రావు, రేపాక కుమారస్వామి, తిప్పని సంపత్, ఎండి రెహమాన్, దాచేపల్లి శ్రీధర్, కొంగల శ్రీధర్, సూరం శంకర్, భాగ్య రేఖ, సంధ్య, సబితా, ఇతర నాయకులు మర్రి రంజిత్ రెడ్డి, సందీప్ రెడ్డి, రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.