పెట్రోల్ డీజిల్ ధరలు ను వెంటనే తగ్గించాలి: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ.
Published: Thursday February 18, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం ప్రజాపాలన: బుధవారం జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల కు వ్యతిరేకంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఆందోళన పిలుపులో భాగంగా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల వెన్ను వీరు చడంలో భాగంగానే ఈ యొక్క ధరల పెరుగుదల అని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు కానీ రైతులకు గిట్టుబాటు ధర గాని ఏమీ ఇవ్వకుండా ఒకపక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన టువంటి ధరలను ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలని లేనియెడల న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎం సంజీవ్ పార్టీ నాయకులు నరసింహ కృష్ణచంద్రయ్య రామకృష్ణ భగవాన్ జోహార్ లాల్ సంధ్యా లచ్చమ్మ విజయ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: