కేశవరావుకు నాట్యమండలి కళాకారులు నివాళులు..
Published: Wednesday January 11, 2023
తల్లాడ, జనవరి 10 (ప్రజా పాలన న్యూస్):
ప్రముఖ పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక నటుడు చీకటి కేశవరావు ఇటీవల మృతి చెందారు. మంగళవారం ఆయన దశదిన కార్యక్రమానికి పౌరాణిక నాట్యమండలి సభ్యులు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో పౌరాణిక నటులు ఉల్లి పార్థసారథి, నున్నా సాందీపులు, గుమ్మ వలరాజు, మల్లిడి శేషయ్య, రాయపాటి వెంకటయ్య, ఉల్లి సత్యనారాయణ, ఆపతి రాములు సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. కేశవరావు మృతి పౌరాణిక నాటకానికి తీరని లోటు అన్నారు.
Share this on your social network: