ఏకగ్రీవంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక
మంచిర్యాల టౌన్, నవంబర్ 14, ప్రజాపాలన : ఏకగ్రీవంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లైసెన్స్ హోల్డర్స్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ పాత గర్మిల్ల యొక్క పాలక వర్గం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి జి.హనుమంత్ రెడ్డి, సహకార సంఘాల అసిస్టంట్ రిజిస్ట్రార్ హాజరై సంఘం ఎన్నికలను సభ్యుల సూచనల మేరకు ఏకగ్రీవం చేశారు. అధ్యక్షునిగా జక్కుల రాజు ముదిరాజ్, ఉపాధ్యక్షునిగా కొలిపాక తిరుపతి, జనరల్ సెక్రెటరీగా సంద వేన ప్రవీణ్, కోశాధికారిగా కనుకుంట్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు డైరెక్టర్స్ గా పిట్టల రాజన్న, తుటి సతీష్, జక్కుల సురేష్, బల్ల రమేష్, నీలం మల్లేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి చే ఎన్నికైన పత్రాన్ని అధికారికంగా నూతన పాలక వర్గానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజశేఖర్ ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు తూటి శ్రీనివాస్ ముదిరాజ్ పట్టణ ఆర్గనైజర్ సెక్రెటరీ మడిగల సురేష్ పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: