మున్నూరు కాపు సంఘం గ్రామ కమిటీ ఎన్నిక
Published: Friday December 23, 2022
జన్నారం, డిసెంబర్ 22, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలో గురువారం మున్నూరు కాపు నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోటిగూడ గ్రామ మున్నూరు కాపు నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులు కయ్యాల మల్లయ్య, అధ్యక్షులు ఉప్పు రాజన్న, ఉపాధ్యక్షులు పల్లె రాజన్న, లక్కాకుల మల్లేష్, ప్రధాన కార్యదర్శుడు శేపురి గోపాల్, కార్యదర్శి శేపూరి లక్ష్మణ్, కోశాధికారి నీరటి రవికుమార్, కార్యవర్గ సభ్యులు ఉప్పు గంగయ్య, పులిశెట్టి శేఖర్, ఉప్పు మహేష్, పులి శెట్టి సత్తయ్య, కొంతం రాజశేఖర్, లను గ్రామ కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు.
Share this on your social network: