అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

Published: Thursday December 08, 2022

మధిర డిసెంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాలు అభివృద్ధి కోసం కృషి చేయాలని మధిర మండల పరిషత్ అధ్యక్షురాలు మెండెం లలిత కోరారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వ సభ్యసమావేశం మెండెం లలిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి తహసీల్దార్ రాంబాబు మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్  మండల అధికారులు, ఎంపీటీసీ సర్పంచులు పాల్గొన్నారు.