బిజెపి అద్వార్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ. దగ్దం.

Published: Tuesday November 30, 2021
పెండింగ్  స్కాలర్ షిప్స్ , బీసీ రుణాలను  మంజూరు చేయాలని డిమాండ్.
మంచిర్యాల బ్యూరో, నవంబర్29, ప్రజాపాలన : విద్యార్థుల  పెండింగ్ స్కాలర్ షిప్స్, బీసీ రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిజెపి బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొద్దున మల్లేష్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద కళాశాలల విద్యార్థుల తో కలిసి ధర్నా చేపట్టారు, ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు మూడు సంవత్సరాల నుండి స్కాలర్ షిప్ లు విడుదల చేయకుండా  టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. గత మూడు సంవత్సరాల సంబంధించి స్కాలర్ షిప్ లు ఇప్పటి వరకు విడుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను, కళాశాల యాజమాన్యలను ఇబ్బందులకు గురి చేస్తుంది అని అన్నారు. అదే విధంగా గతం లో విద్యార్థులకు ఇచ్చే మైంటైనన్స్ 5 వేల రూపాయలను 3500 కు తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్ షిప్ లు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోద్దుల మల్లేష్, మొటపలుకుల తిరుపతి, పెద్దపల్లి పురుషోత్తం, అరుముల్ల పోశం, బల్ల రమేష్, డేగ నగేష్, మధవరపు వెంకట రమణ రావు, పట్టి వెంకట కృష్ణ, ముదాం మల్లేష్, గోళ్ళ రాజేష్, దామెరకుంట నరసయ్య, ముడారి శ్రీకాంత్, బండి రజలింగు, కలశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.