యూనివర్సిటీలో సీటు సాధించిన విద్యార్థిని అభినందించిన సర్పంచ్
Published: Friday December 16, 2022
తల్లాడ, డిసెంబర్ 15 (ప్రజా పాలన న్యూస్) :- మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గుర్రాల నర్సిరెడ్డి కుమారుడు సాయిరామకేశవరెడ్డి చదువులో ఉన్న స్థాయి లక్ష్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒకటో తరగతి ఏడవ తరగతి వరకు తెలంగాణ గ్రామర్ స్కూల్లో చదివి తర్వాత కల్లూరు లో గల ప్రతిభ విద్యాలయంలో పదవ తరగతి పూర్తి చేసి అగ్రిసెట్ రాసి మధిర లో గల అగ్రికల్చర్ డిప్లమా లో సీటు సంపాదించి అది పూర్తయిన తర్వాత ఉన్నత చదువుకై హైదరాబాద్ జయశంకర్ వ్యవసాయ శాఖ యూనివర్సిటీ లో సీటు రావడం జరిగింది. ఇలా ఉన్నత స్థాయికి ఎదుగుతున్న సాయి రామ కేశవ రెడ్డిని గ్రామ సర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి ప్రత్యేకంగా అభినందించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. పలువురు గ్రామస్తులు కూడా అభినందించారు.
Share this on your social network: