సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి

Published: Thursday September 09, 2021
కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత
మధిర, సెప్టెంబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉన్నదని టిఆర్ఎస్ జిల్లా నాయకులు లైన్స్ క్లబ్ మధిర చైర్మన్ కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత దంపతులు పేర్కొన్నారు. మల్లాది వాసు సవిత దంపతుల పెద్ద కుమారుడు ఎన్ఆర్ఐ మల్లాది యశ్వంత్ చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం మధిర డాక్టర్ వసంతమ్మ మానసిక వికలాంగుల వసతి గృహంలోని మానసిక వికలాంగులకు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక వికలాంగుల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిలారి రవి, అనూష శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.