కరోనా కష్టకాలంలో నిరుపేదలకు వరంగా మారిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన

Published: Tuesday June 08, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా కష్ట కాలంలో లాక్ డౌన్ వల్ల ఉపాధి లేకపోవడంతో నిరు పేదల ఆకలి బాధలు తీర్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గరీబ్ కళ్యాణ్ యోజన కింద కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 5 కిలోల బియ్యం మూడు నెలల వరకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని శేరిలింగంపల్లి 106 డివిజన్ బీజేపీ అద్యక్ష్యులు రాజు శెట్టి కురుమ అన్నారు. ఈరోజు రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో రాజీవ్ గృహకల్ప లోని చౌక ధర దుకాణం (రేషన్ షాపు) ని తనిఖీలో భాగంగా బియ్యాన్ని పంపిణీ చేసి జనాలకు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళిత మొర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్య కుర్మా, కోశాధికారి పి.కౌసల్య, బాలు, స్వాతి స్థానికులు పాల్గొన్నారు.