మండలంలో విజృంభిస్తున్నా కరోనా

Published: Monday January 24, 2022
జన్నారం రూరల్, జనవరి 23, ప్రజాపాలన: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రిలో ఆదివారం పదకొండు కరోనా కేసులు నమోదైనాయని మండల వైద్యురాలు సునితా తెలిపారు. వైధ్యురాలు తెలిపిన వివరాలప్రకారం.   మధ్యాహ్నం 51 మందికి కరోనా పరీక్షలు చేశామని వారిలో 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించడం జరిగిందని అమె అన్నారు., జన్నారం మండలంలో కరోనా తీవ్రతా ఎక్కువగా ఉందని మండల ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు దరించాలని కోరారు. గడిచిన తొమ్మిది రోజులుగా జన్నారం మండలంలో నమెాదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44 కు చేరుకుంది అమె తెలిపారు.