కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Saturday June 26, 2021
జగిత్యాల, జూన్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాలలోని ఎస్విఎల్ఆర్ గార్డెన్ లో జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదిముబరక్ చెక్కులను 99 మంది లబ్ధిదారులకు కోటి రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రురల్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ పాక్స్ చైర్మన్లు మైపాల్ రెడ్డి సందీప్ రావు బాల ముకుందం సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.