డి ఎం హెచ్ ఓ మాలతి తో నేలకొండపల్లి అఖిల పక్ష నాయకుల భేటీ..

Published: Wednesday November 24, 2021
పాలేరు నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను డి ఎం హెచ్ ఓ మాలతి ద్రుష్టి కి తీసుకెళ్ళిన నేలకొండపల్లి అఖిల పక్ష నాయకులు. ఇరవై నాలుగు గంటలు ఐదుగురు డాక్టర్లు అందుబాటులో ఉండాలని, అన్నిరకాల మందులు, ఈసిజీ తీసే సౌకర్యాం, హాస్పిటల్ ను పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ సౌకర్యం ఉండాలని, ఇంకా పలు సమస్యల డి ఎం హెచ్ ఓ మాలతి ద్రుష్టి కి తీసుకెళ్ళిన అఖిల పక్ష నాయకులు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి సిపిఐ మండల కార్యదర్శి కర్నాటి బానుప్రసాద్, సిపిఎం మండల కార్యదర్శి కేవీ రెడ్డి, నేలకొండపల్లి సిపిఐ గ్రామ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు పగిడికత్తుల రామదాసు, సిపిఎం మండల నాయకులు ఏటుకూరి రామారావు, గుడవర్తి నాగేశ్వరరావు, బిజెపి మండల అధ్యక్షుడు మన్నే క్రిష్ణ, చెన్నబోయిన మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.