పాత పెన్షన్ దారులకు గుర్తింపు పత్రాల పంపిణీ

Published: Thursday September 15, 2022

రాయికల్, సెప్టెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయికల్ పట్టణములో పాత పెన్షన్ దారులకు  పెన్షన్ గుర్తింపు కార్డులను మునిసిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ కొత్తగా మంజూరు అయిన 453 మందికి పెన్షన్ గుర్తింపు కార్డులను మరియు ధ్రువపత్రాలను జగిత్యాల నియోజకవర్గ శాసన సభ్యులు యం. సంజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేసామని,పాత పెన్షన్ దారులు మొత్తం 3283మందికి  పెన్షన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని తెలియజేసారు.