బెల్లంపల్లి నుండి వేమనపల్లికి బస్సులు నడిపించండి రేగుంట చంద్రశేఖర్ విజ్ఞప్తి

Published: Friday November 25, 2022
బెల్లంపల్లి నవంబర్ 24 ప్రజా పాలన ప్రతినిధి: నియోజకవర్గమైన బెల్లంపల్లి నుండి మండల కేంద్రమైన వేమనపల్లికి ఆర్టీసీ బస్సులు నడిపించాలని సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రేగుంట చంద్రశేఖర్, మంచిర్యాల డిపో మేనేజర్ కు గురువారం విజ్ఞప్తి చేశారు.
గురువారం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లి పట్టణం నుండి వేమనపల్లి కి పోవడానికి, రావడానికి బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అనారోగ్యాలకు గురైన ప్రజలు, ఆస్పత్రులకు వెళ్లాలన్న, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని, మంచిర్యాల డిఎం వెంటనే వేమనపల్లి మండలానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, మండల కార్యదర్శి అందే పురుషోత్తం, దేవర బోయిన చిన్న శంకర్, అందే మహేష్, తదితరులు పాల్గొన్నారు.