ధారూర్ లో భారత్ బంద్ ను విజయవంతం చేద్దాం

Published: Monday September 27, 2021
ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి
వికారాబాద్ బ్యూరో 26 సెప్టెంబర్ ప్రజాపాలన : సోమవారం జరుగబోవు భారత్ బంద్ ను విజయవంతం చేద్దామని ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినాయకత్వం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపు మేరకు ధారూర్ మండల కేంద్రంలో భారత్ బంద్ ను విజయవంతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, రాజకీయ ప్రతినిధులు, హితైషులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.