వజ్రోత్సవ ముగింపు వేడుకలలో విద్యార్థులకు బహుమతులు ప్రధానం
Published: Tuesday August 23, 2022
ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా లయన్స్ క్లబ్ ఇబ్రహీంపట్నం ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎన్.అశోక్ హాజరు అయ్యి, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ఉంటుందని, జీవితానికి అవసరమయ్యే విలువలు, విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే నేర్పుతారని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో రంగోళి, చెస్, క్యారం బోర్డ్, ఖో ఖో, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు లైన్స్ క్లబ్ వారు సమకూర్చిన బహుమతులను అశోక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రదనోపాధ్యాయులు పొగాకు సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: