పార్స్ ఏ.పీ స్టేట్ యువజన విభాగము(గుంటూరు ఈస్ట్) కు ప్రెసిడెంట్ గా చింతగుంట్ల రమేష్ నియామకం
Published: Thursday July 28, 2022
జులై 27 ప్రజాపాలన ప్రతినిధి : పూలే అంబేడ్కర్ రాజ్యాధికారి సమితి PARS ఏ.పీ స్టేట్ యువజన విభాగము కు ప్రెసిడెంట్ గా చింతగుంట్ల రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు PARS ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ కటికల రవి కుమార్ , చింతగుంట్ల రమేష్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు గుంటూరు పరిధిలొ రాజకీయ అవగాహన ఉన్న ముఖ్య నాయకులతో కమిటీలను నియమించడంతో పాటు బహుజన వాదాన్ని బలపరిచే వివిధ రంగాలలో పని చేస్తున్న వారిని పార్స్ అనుబంధ సంఘాలుగా వీరి పరిధిలొ నియమించి, రెండు విభాగాల మధ్య సమన్వయ పరిచి వారందరి సహకారంతో బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని ఈ సంధర్బంగా ఆయన పేర్కొన్నారు. చింతగుంట్ల రమేష్ నియామకం పట్ల పలువురు బహుజనులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేసారు.
Share this on your social network: