కార్యకర్తల కుటుంబాలకు పొంగులేటి భరోసా పలు కుటుంబాలకు ఆర్ధిక సహాయం..

Published: Tuesday August 03, 2021
ఖమ్మం :ఆగస్టు 2 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం : మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా పర్యాటనలో భాగంగా రఘునాథపాలెం, కొణిజర్ల, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో పర్యటించారు. రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామంలో కొర్రా శ్రీను నూతన గృహ ప్రవేశం సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మూడు చిన్నా, భుక్యా నాగేశ్వరరావు, భుక్యా శ్రీను, లకావత్ రమేష్, కొర్రా కృష్ణ, లకావత్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల : సోమవారం కొణిజర్ల మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బోడే తండా ఉపసర్పంచ్ బాబారావు-రంగమ్మ దంపతులు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తనికెళ్ళ టీఆర్ఎస్ నాయకులు బానోత్ వెంకటేశ్వర్లు ఇటీవల ఆపరేషన్ చేయించుకోగా వారిని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అమ్మపాలెం గ్రామంలో ఉ పసర్పంచ్ పుప్పాల రామారావుగారు ఇటీవల గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అమ్మపాలెం మాజీ ఎంపీటీసీ గుగులోత్ శ్రీనుగారు మరణించగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తేజావత్ మదన్ గారు ఇటీవల ప్రమాదంలో గాయపడగా ఆయనను పరామర్శించి, ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాతంగా గ్రామంలో 4వ వార్డు మెంబర్ ఉమ గారి తల్లిదండ్రులు తేజావత్ లక్ష్మా-కాంతమ్మలు చనిపోగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 9వ వార్డు మెంబర్ సరిత మామగారు గుగులోత్ మంగ్యా మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పర్యటనలో భాగంగా ఆయా కుటుంబాలకు పొంగులేటి ఆర్ధిక సహాయంను అందజేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట రాష్ట్ర మార్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మండల రైతు కన్వినర్ దొడ్డపునేని రామారావు, జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాసరావు, రాయల పుల్లయ్య, ధరావత్ రాంబాబు, ఏలూరి శ్రీను, జడల మల్లేష్ యాదవ్, సర్పంచ్లు వాంకుడోత్ బాలాజీ, అద్దంకి చిరంజీవి, మూడు సురేష్, రాయల నాగేశ్వరరావు, రంగు సత్యనారాయణ, ఎంపీటీసీలు గుండ్ల కోశ్వరరావు, బొరా ప్రసాద్, వింజం విజయ, దొడ్డపనేని లలిత కుమారి, బానోత్ అనూష, వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దారావత్ బాబులాల్, సురభి వెంకటప్పయ్య, మండల నాయకులు రాచ్చ రామకోటయ్య, కొనకంచి మోషే, వట్టికూటి సైదులు గౌడ్, కనగంటి రావు, చల్లగొండ్ల సురేష్, మూర్కుపుడి ప్రసాద్, షేక్ జాన్పషా, కోసూరి నాగసైదులు, పొట్లపల్లి హసేన్, కోసూరి నాగేశ్వరరావు, కటుకూరి నర్సింహారావు, వడిత్యా రంగారావు, గండమాల ఆశీర్వాదం, ఇస్రాం సైదులు తదితరులు పాల్గొన్నారు.