నిర్బంధ వాహన వేలం
Published: Thursday December 09, 2021
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 8, ప్రజాపాలన : జిల్లాలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధించిన వాహనమును వేలం వేయనున్నట్లు జిల్లా రవాణా అధికారి లెక్కల కిష్టయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎ.పి.21 యు 1853 నంబర్ గల హెవీ గూడ్స్ వాహనంను తుక్కు క్రింద తీసివేసేందుకు ఈ నెల 14వ తేదీన వేలము వేసేందుకు నిర్ణయించడం జరిగిందని, వేలములో పాల్గొనదలచిన వారు ధరావతు సొమ్ము ముందుగా చెల్లించి వేలములో పాల్గొనవలసి ఉంటుందని, వాహనమును చూడదలచిన వారు లక్షెట్టిపేట పోలీన్ స్టేషను వెళ్ళి చూడవచ్చవని తెలిపారు.
Share this on your social network: