నిర్బంధ వాహన వేలం

Published: Thursday December 09, 2021
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 8, ప్రజాపాలన : జిల్లాలోని లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధించిన వాహనమును వేలం వేయనున్నట్లు జిల్లా రవాణా అధికారి లెక్కల కిష్టయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎ.పి.21 యు 1853 నంబర్ గల హెవీ గూడ్స్ వాహనంను తుక్కు క్రింద తీసివేసేందుకు ఈ నెల 14వ తేదీన వేలము వేసేందుకు నిర్ణయించడం జరిగిందని, వేలములో పాల్గొనదలచిన వారు ధరావతు సొమ్ము ముందుగా చెల్లించి వేలములో పాల్గొనవలసి ఉంటుందని, వాహనమును చూడదలచిన వారు లక్షెట్టిపేట పోలీన్ స్టేషను వెళ్ళి చూడవచ్చవని తెలిపారు.