కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి

Published: Friday March 03, 2023

జన్నారం, మార్చి 02, ప్రజాపాలన: కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తామన్నారు. ఎనిమిది నెలల్లో రెండోసారి గ్యాస్ ధరలు సిలిండర్ పై కేంద్రం రూ,50 పెంచడంతో సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తుదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలు అమాంతగా పెంచి ప్రజల నడ్డి పిరుస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులకు మేలు జరగడానికి గ్యాస్ ధరలు పెంచారన్నారు. గ్యాస్ ధరలు రెండోసారి పెరగడంతో మరింత భారం ఉందని పేదలు ఆందోళన వ్యక్తం చేస్తునరన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.