కల్వకుంట్ల కవితను కలిసిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్ మేడిపల్లి, సెప్టెంబర్28 (ప్రజాపా

Published: Thursday September 29, 2022
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లోని హెచ్ఎంటి నగర్లో దళిత బంధు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన చిలకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళితులలో అభ్యున్నతి కొరకు కృషి చేయాలని గొప్ప సంకల్పంతో, దళితులు కూడా సగర్వంగా సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో దళితులు తమ కాళ్ళపై తాము నిలబడుతూ మరో పదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిలో చూడాలని కెసిఆర్ ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిలకా నగర్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ , కొండల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి జగన్, మాస శేఖర్, బాలు, శ్యామ్, మహిళా అధ్యక్షురాలు సుభద్ర, సరిత ఆండాలు, తదితరులు పాల్గొన్నారు.