పేకాట రాయుళ్లు అరెస్టు
Published: Tuesday October 25, 2022
మధిర రూరల్ అక్టోబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) మండలం లోని
నిధానపురం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 5 గురు వ్యక్తులను ఆదివారం మధిర రూరల్ పోలీసులు పట్టుకొని వారి వద్ద నుండి ఆరు వేల వంద రూపాయల నగదు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా జోదంగానే కోడిపందాలు కానీ జరిగితే వెంటనే 100కి కానీ పోలీస్ స్టేషన్కు కానీ సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వ్యక్తులు వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు
Reply
Forward
|
Share this on your social network: